News July 1, 2024

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు అసాధ్యం: CBSE

image

ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2సార్లు బోర్డు ఎగ్జామ్స్ అసాధ్యమని CBSE తెలిపింది. ఏడాదికి 2సార్లు పరీక్షలు పెట్టి, ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యాశాఖ AUGలో సిఫార్సు చేసింది. ఈ మేరకు CBSE ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. దీంతో పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో చర్చించిన CBSE ప్రస్తుతం ఈ విధానం అసాధ్యమని తెలిపింది.

Similar News

News July 5, 2024

UK ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి

image

వక్త, రచయిత ఉదయ్ నాగరాజు UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్‌(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్‌‌లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.

News July 5, 2024

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తప్పుడు ప్రచారం: TDP

image

ప్రధాని మోదీ, AP CM చంద్రబాబు భేటీపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడింది. ‘‘ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, సైకోలకి కోట్లు కుమ్మరిస్తూ ‘తాడేపల్లి ప్యాలెస్ సైకో’ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. PM, CM భేటీపై కూడా ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ సృష్టించారు. నిన్న కూడా అసలు రాష్ట్రంతో చర్చలే జరపని capgemeni వెళ్లిపోయిందంటూ విష ప్రచారం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ట్వీట్ చేసింది.

News July 5, 2024

మీ ప్రేమకు చాలా థ్యాంక్స్: సూర్య కుమార్

image

ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన ‘విక్టరీ పరేడ్’ గురించి స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘నిన్నటి సాయంత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మా చుట్టూ ఉన్నవారిలో సంతోషం, భావోద్వేగాలు, వేడుకలు చూస్తే అంతా కలగా అనిపించింది. మీరు చూపిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఇది చూస్తే అర్థమవుతోంది మీకు ఈ కప్ అంటే ఎంత ఇష్టమో. ఈ కప్ మీ అందరికీ చెందినది’ అని ట్వీట్ చేశారు.