News July 1, 2024
మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు: జేపీ నడ్డా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1714341524477-normal-WIFI.webp)
పశ్చిమబెంగాల్లోని చోప్రాలో నడిరోడ్డుపై ఓ మహిళను <<13539360>>దారుణంగా<<>> కొట్టిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. ‘మతతత్వ పాలనల్లో మాత్రమే ఉండే క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ బెంగాల్లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి TMC నేతలు ఈ చర్యను సమర్థిస్తున్నారు. దీదీ పాలిస్తున్న బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 5, 2024
BREAKING: ‘నీట్’ రద్దు చేయలేం: కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720176541607-normal-WIFI.webp)
నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సమాధానంగా అఫిడవిట్ వేసింది. ‘పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. CBI దర్యాప్తునకు ఆదేశించాం’ అని పేర్కొంది.
News July 5, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720933707-normal-WIFI.webp)
TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
News July 5, 2024
చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720175636334-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.