News July 1, 2024
నిర్మల్: ఘనా దేశంలో జిల్లా వాసి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719813339146-normal-WIFI.webp)
నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బరిగల వెంకటేశ్(34) బతుకు తెరువు కోసం ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశ్ మృతదేహాన్నివీలైనంత తొందరగా స్వగ్రామానికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News July 5, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169328349-normal-WIFI.webp)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయనతో కలిసి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఇందులో పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ సత్తు మల్లేశ్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ మాన్ అలీ, తదితరులున్నారు.
News July 5, 2024
జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720166243162-normal-WIFI.webp)
జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News July 5, 2024
ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720148421830-normal-WIFI.webp)
బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.