News July 1, 2024
సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాధిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News October 31, 2025
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
News October 31, 2025
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
News October 31, 2025
SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


