News July 2, 2024

రైళ్ల టైమ్ టేబుల్‌లో నో ఛేంజ్

image

రైళ్ల రాకపోకలకు సంబంధించి టైమ్ టేబుల్ వివరాల్లో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న టైమ్ టేబులే కొనసాగుతుందని పేర్కొంది. కొత్త కాలపట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించడం కోసం గడువును పొడిగించినట్లు పేర్కొంది. కాగా ఏటా రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ ఆ శాఖ ఓ టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తుంది. అది జులై 1 నుంచి వచ్చే జులై 31 వరకు అమల్లో ఉంటుంది.

Similar News

News September 20, 2024

నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్

image

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News September 20, 2024

లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.

News September 20, 2024

ఉప్పరపల్లి కోర్టుకు జానీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.