News July 2, 2024
దేశ ప్రజల ఐక్యత భేష్: మోహన్ భగవత్
భారత్లో అంతర్గగతంగా విభేదాలున్నప్పటికీ ప్రజలంతా కలిసికట్టుగానే ఉన్నారని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై మనపై దాడికి యత్నించినప్పుడు వారిలో ఆ ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు. భారత సైనికుడు అబ్దుల్ హమీద్ జీవితం ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
Similar News
News September 20, 2024
ఉప్పరపల్లి కోర్టుకు జానీ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.
News September 20, 2024
CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.
News September 20, 2024
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా రాథోడ్
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ను నియమించింది. ఆయన ఇటీవల భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పని చేశారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇప్పటికే ప్రధాన కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్కు అప్పగించింది. తాజాగా రాథోడ్ను సైతం నియమించుకుంది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరూ తెర వెనుక కీలకపాత్ర పోషించారు.