News July 2, 2024
ఒంగోలు: స్పాట్లో సమస్యను పరిష్కరించిన కలెక్టర్

ఒంగోలు స్థానిక పట్నంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఇద్దరు దివ్యాంగులు తమకు వీల్ ఛైర్, రెండు శ్రవణ యంత్రాలు కావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అర్జీ అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన వీల్ ఛైర్, వినికిడి పరికరాలు సమకూర్చి కలెక్టర్ వారికి అక్కడే అందజేశారు.
Similar News
News November 4, 2025
ఆఫీస్కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
ప్రకాశం: ఉచితంగా 3 వీలర్ మోటారు సైకిల్స్.. అప్లై చేయండిలా.!

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులన్నారు.
News November 4, 2025
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.


