News July 2, 2024

చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి సస్పెండ్

image

AP: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్ సస్పెండయ్యారు. శాంతిపురం(మ) శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో CBN ఇల్లు కట్టేందుకు TDP నేతలు దరఖాస్తు చేశారు. సబ్ డివిజన్ చేసేందుకు హుస్సేన్ రూ.1.80 లక్షలు అడిగారు. ఇటీవల CM కుప్పం టూర్‌లో TDP నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఆరా తీసి, కలెక్టర్ విచారణ జరిపించగా నిజమని తేలింది. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

Similar News

News September 20, 2024

ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా

image

నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.

News September 20, 2024

భారత్ 376 పరుగులకు ఆలౌట్

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయ్యింది. అశ్విన్(113), జడేజా(86), జైస్వాల్(56) రాణించడంతో భారత్ 376 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 5, టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.

News September 20, 2024

లడ్డూ వివాదం.. హైకోర్టుకు వైసీపీ!

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించనుంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.