News July 2, 2024

శ్రీవారి దర్శనానికి 8 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

Similar News

News September 20, 2024

సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్

image

కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్‌ను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.

News September 20, 2024

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముగ్గురు టాప్ డైరెక్టర్లు!

image

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ గురించి ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాప్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ హాజరవుతారని చర్చ సాగుతోంది. అయితే ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

News September 20, 2024

ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’

image

రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.