News July 2, 2024
అందుకే పిచ్పై మట్టి తిన్నా: రోహిత్

T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్ మీద <<13536415>>మట్టి <<>>తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్శర్మ వెల్లడించారు. ‘ఆ పిచ్పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో SAపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News October 30, 2025
WWC: ఆసీస్ భారీ స్కోరు.. భారత్ టార్గెట్ ఎంతంటే

మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆలౌటైంది. లిచ్ఫీల్డ్ సెంచరీ(119) చేయగా, పెర్రీ(77), గార్డ్నర్ (63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తి, చరణి చెరో 2 వికెట్లు, క్రాంతి, అమన్జ్యోత్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 339 రన్స్.
News October 30, 2025
నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత.. మీరేమంటారు?

ఏ వ్యక్తికైనా నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో మానసిక రోగాలు, వ్యసనాలు దాదాపు కుదుటపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఆస్తి, అప్పులు సర్దుబాటు అవుతాయి. కొత్త స్నేహాలు, అక్రమ సంబంధాల ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయాలు, బంధుత్వాలు, శత్రువులు వంటి విషయాలపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యక్తిగత లక్ష్యాల కంటే కుటుంబ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు.
News October 30, 2025
కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.


