News July 2, 2024
హిండెన్బర్గ్కు సెబీ నోటీసులు

గతఏడాది అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.
Similar News
News January 7, 2026
విక్కీ కౌశల్ కొడుకు పేరు.. ‘Uri’ మూవీతో లింక్!

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు గతేడాది నవంబర్ 7న <<18223859>>మగబిడ్డకు<<>> జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ తమ కొడుక్కి విహాన్ కౌశల్ అని పేరు పెట్టినట్లు వారు వెల్లడించారు. అయితే ఈ పేరుకు ‘Uri: The Surgical Strike’ మూవీతో లింక్ ఉండటం గమనార్హం. 2019 జనవరి 11న రిలీజైన ఈ చిత్రంలో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రను విక్కీ పోషించారు. దానికి గుర్తుగానే విహాన్గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
News January 7, 2026
మున్సిపల్ ఎన్నికలపై SEC సన్నాహాలు

TG: మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు ఆదేశాలిచ్చారు. ‘JAN 12న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలి. 13న పోలింగ్ కేంద్రాల జాబితాను ‘T పోల్’లో పొందుపర్చాలి. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలి’ అని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకాన్ని ముమ్మరం చేయాలన్నారు.
News January 7, 2026
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కబీంద్ర పుర్కాయస్థ(94) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిల్చార్ (అస్సాం)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931లో జన్మించిన ఈయన 1991, 98, 2009లో లోక్సభ ఎంపీగా గెలిచారు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. కబీంద్ర మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.


