News July 2, 2024
సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. నిన్న సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్టీ ఎంపీలతో మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు ఆయన వివరించారు.
Similar News
News September 20, 2024
దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.
News September 20, 2024
సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు
✒ 1924: ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1949: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం
News September 20, 2024
నేను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని: మహేశ్కుమార్ గౌడ్
TG: దేశంలోని SC, ST, BC, మైనార్టీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 నుంచి 23 శాతం తగ్గించిందని దుయ్యబట్టారు.