News July 2, 2024
భారత్-శ్రీలంకలో 2026 T20 వరల్డ్కప్
భారత్-శ్రీలంక ఆతిథ్యంలో 2026 T20 వరల్డ్ కప్ జరుగుతుందని ICC ప్రకటించింది. 20 జట్లతో గ్రూప్, సూపర్ 8, నాకౌట్ ఫార్మాట్లో టోర్నీ ఉండనుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక, 2024 టోర్నీ రన్నరప్ హోదాలో సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, US, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్, నేరుగా క్వాలిఫై అయ్యాయి. మరో 8 జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి.
Similar News
News September 19, 2024
రవిచంద్రన్ అశ్విన్.. ది ఆల్రౌండర్!
చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్రౌండర్ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్గా 500 వికెట్లు, బ్యాటర్గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.
News September 19, 2024
AP: స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పుడంటే?
తెలంగాణలో స్కూళ్లకు దసరా <<14141736>>సెలవులు <<>>ప్రకటించడంతో ఏపీలో ఎప్పట్నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమై అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతికి సెలవు కాగా.. 3వ తేదీన వర్కింగ్ డేగా ఉండనుంది. ఇటీవల వర్షాలతో పలు జిల్లాల్లో 5-6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం.
News September 19, 2024
లడ్డూ విషయంలో దేవుడు క్షమించడు: బండి
లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో AP ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.