News July 2, 2024

పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు

image

AP: పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు పని చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు. వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. తక్షణమే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగుచేయాలి. నిత్యావసర సరకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తెలో వర్షపు చినుకు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే వర్షం నీటిలో పడితే అదే నీటిలో కలిసిపోతుంది. అదే విధంగా ఏదైనా దక్కాలనే ప్రాప్తి ఉంటే అదృష్టము ఎక్కడికీ పోదు.

News September 20, 2024

స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన.. రూ.25 వేల ఫైన్

image

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎదుటే మలవిసర్జన చేశాడు. దీంతో కోర్టు అతడికి రూ.25 వేల ఫైన్ విధించింది. గతేడాది భారత్‌కు చెందిన రాము చిన్నరాసా అనే కార్మికుడు మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు. తర్వాత మద్యం మత్తులో బాత్‌రూమ్‌కు వెళ్లే దారి తెలియక హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News September 20, 2024

దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే

image

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్‌ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్‌తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.