News July 2, 2024
వైజాగ్ వారియర్స్కు మరో విజయం

APLలో వైజాగ్ వారియర్స్ ఘన విజయం సాధించింది. విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వైజాగ్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Similar News
News December 26, 2025
విశాఖలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకం

విశాఖలో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. GVMC ఆధ్వర్యంలో నగరంలోని మధురవాడ, ఆర్ఆర్ సెంటర్, గాజువాక, కూర్మన్నపాలెం, దువ్వాడ ఫ్లైఓవర్ కింద, సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో తొలి దశలో 250 వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, నగర సుందరీకరణ, వీధి వ్యాపారుల జీవనోపాధి భద్రతే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
News December 26, 2025
విశాఖ: నకిలీ డాక్టర్గా చలామణీ అవుతున్న కేటుగాడి అరెస్ట్ (1/2)

నకిలీ వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదివి కార్ డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడు, గతంలో 33 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇతడి నుంచి రూ. 30 వేల నగదు, స్టెతస్కోప్, వైట్ అప్రాన్ స్వాధీనం చేసుకున్నారు.
News December 25, 2025
విశాఖ: సెప్టిక్ ట్యాంక్లో పడి చిన్నారి మృతి

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.


