News July 2, 2024
కలెక్టర్గా ‘హిమాన్షు శుక్లా’ మార్క్.. 2 వంతెనలకు ఆయన పేరు

అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్గా హిమాన్షు శుక్లా తనముద్ర వేసుకున్నారు. ఎంతలా అంటే.. జిల్లాలోని 2 వంతెనలకు ఆయన పేరు పెట్టుకునేంత. మామిడికుదురు-అప్పనపల్లిని కలిపే వంతెనకు ‘శుక్లా వారధి’ అని.. లుటుకుర్రు-పాశర్లపూడిని కలిపే వంతెనకు ‘హిమాన్షు శుక్లా రామసేతు’ అని ఆయా గ్రామ పంచాయతీలలో తీర్మానం చేసి నామకరణం చేసుకున్నారు. ఈ వంతెన నిర్మాణంలో హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News December 31, 2025
అతిపెద్ద జిల్లాగా అవతరించనున్న ‘తూ.గో.’

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. ఈ విలీనంతో తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి భారీ జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.
News December 31, 2025
తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్లోనే 100 కోట్లు హాంఫట్!

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


