News July 2, 2024
కోహ్లీతో బాబర్కు పోలికేంటి?: పాక్ మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో బాబర్ ఆజమ్కు పోలికేంటని పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఎద్దేవా చేశారు. ఈ తరంలో విరాట్ ఓ లెజెండ్ అని ఆయన కొనియాడారు. ‘కోహ్లీ ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తారు. తన ఆఖరి T20 మ్యాచ్లో కూడా చెలరేగారు. టీ20 కెరీర్ను ఆయన అద్భుతంగా ముగించారు. అదీ కోహ్లీ బ్రాండ్. ప్రస్తుత తరంలో విరాట్కు ఎవరూ సాటిరారు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News July 8, 2024
‘నీట్’పై విచారణ గురువారానికి వాయిదా
‘నీట్’ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పేపర్ లీకైన మాట వాస్తవమే. లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్నీ జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.
News July 8, 2024
రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?
తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
News July 8, 2024
హిండెన్బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!
కింగ్డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్బర్గ్తో కింగ్డన్కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.