News July 2, 2024

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదల

image

TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

Similar News

News July 8, 2024

‘బాస్’లను అమ్మకానికి పెడుతున్నారు!

image

చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగులను కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా బాస్‌ ఫర్ సేల్, కొలీగ్స్ ఫర్ సేల్ అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. రూ.4లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధర ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా అమ్మడం, కొనడం జరగవు. కేవలం సంతృప్తి కోసమే అలా ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తున్నారు.

News July 8, 2024

పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి: పోలీసులు

image

TG: మొబైల్ ఫోన్ వాడకంతో పిల్లలు తప్పుదారి పడుతున్నారని, 9వ తరగతి పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసులు సూచించారు. ‘పిల్లలు ఎదుగుతున్నారంటే వారికి చెడు దారులు సైతం ఎదురవుతాయి. మంచి- చెడు మధ్య తేడా తెలియని వారినే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత’ అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
>>SHARE IT

News July 8, 2024

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

image

తెలంగాణను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న రాత్రి HYD జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్స్, బార్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యువత దగ్గర డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఉన్నాయా? అని చెక్ చేశారు. పబ్స్‌లో వీటి వాడకాన్ని యజమానులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.