News July 2, 2024
అనంతపురం జిల్లా మహిళలకు గుడ్న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719933635750-normal-WIFI.webp)
జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ సంస్థ శుభవార్త చెప్పింది. ఆకుతోటపల్లిలోని ఎస్కే యూనివర్సిటీ పక్కనున్న రూడ్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, జర్దోసి మగ్గంలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సౌకర్యం కల్పిస్తామన్నారు. 9618876060కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News July 8, 2024
అనంత: కక్కలపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720394176365-normal-WIFI.webp)
కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. గత నాలుగైదు రోజులు కిలో గరిష్ఠ ధర రూ.35 పైన పలుకుతూ వచ్చాయి. ఆ ధర ఆదివారం రూ.30కి పడిపోయింది. కిలో సరాసరి ధర రూ.23, కనిష్ఠ ధర రూ.18తో పలికినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మొత్తంగా మార్కెట్లోని మండీలకు 60 టన్నుల టమాటా వచ్చాయన్నారు.
News July 8, 2024
పీఏబీఆర్లో పడిపోయిన నీటిమట్టం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720408238614-normal-WIFI.webp)
కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) డ్యాంలో నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి డ్యామ్లో 0.588 టీఎంసీల నీరు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన శ్రీరామారెడ్డి, సత్యసాయి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
News July 8, 2024
అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720402370664-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.