News July 2, 2024
నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు: డేవిడ్ మిల్లర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719934114444-normal-WIFI.webp)
సౌతాఫ్రికా విధ్వంసక ప్లేయర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ పలికినట్లు వదంతులు వస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరిదని ప్రచారం జరుగుతోంది. వీటిపై సోషల్ మీడియా వేదికగా మిల్లర్ స్పందించారు. ‘నేను టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగడం లేదు. దక్షిణాఫ్రికా తరఫున నా సేవలు కొనసాగిస్తా. నా నుంచి ఇంకా మంచి ప్రదర్శన రావాల్సి ఉంది’ అని ఆయన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News July 8, 2024
పేటీఎం షేర్లలో 9% వృద్ధి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716378862144-normal-WIFI.webp)
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 8, 2024
శ్మశానంలో సమాధులకు సినిమాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720424633539-normal-WIFI.webp)
థాయ్లాండ్లోని ఓ శ్మశానవాటికలో సమాధుల వద్ద కుర్చీలు వేసి సినిమాలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్లోని ఓ శ్మశానవాటికలో సినిమాలు వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. JUNE 2-6 మధ్య ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసమే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. అదే దేశంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తన ప్రేయసిని వివాహం చేసుకోవడం గమనార్హం.
News July 8, 2024
కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలు లేవనెత్తుతాం: పురందీశ్వరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720426942678-normal-WIFI.webp)
AP: కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలను లేవనెత్తుతామని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు NDA పదేళ్ల పాలనలో దేశంలో అద్భుత ప్రగతి ఉందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్బర్ భారత్కు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.