News July 2, 2024
బాబర్ ఆజం ఓ స్వార్థపరుడు: పార్థివ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719939025329-normal-WIFI.webp)
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. ‘పాక్కు ఫఖార్ జమాన్ ఉన్నా, అతడి స్థానంలో బాబర్ ఓపెనర్గా వచ్చారు. చాలా తప్పుడు నిర్ణయమది. పోనీ జమాన్ను వన్ డౌన్లో అయినా పంపలేదు. పాక్ జట్టులో అసలు టీ20 ఆటగాళ్లే లేరు. పలు ఇంటర్నేషనల్ టీమ్స్కంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు’ అని స్పష్టం చేశారు.
Similar News
News July 8, 2024
ఉచిత ఇసుక: టన్ను రూ.1,394.. ఫ్లెక్సీలు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436253657-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News July 8, 2024
ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436749069-normal-WIFI.webp)
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720358078093-normal-WIFI.webp)
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్తో పవన్ వ్యాఖ్యానించారు.