News July 3, 2024
HEADLINES TODAY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719941967834-normal-WIFI.webp)
☛ యూపీ: హాథ్రస్లో తొక్కిసలాట.. 116మంది మృతి
☛ హిందువులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం ఎన్నటికీ క్షమించదు: PM మోదీ
☛ TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
☛ చంద్రబాబుతో భేటీకి సీఎం రేవంత్ సుముఖత
☛ డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించాలి: CM రేవంత్
☛ AP: పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలు
☛ AP: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Similar News
News July 8, 2024
కవిత పిటిషన్పై విచారణ వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716130465543-normal-WIFI.webp)
BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.
News July 8, 2024
మణిపుర్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720437127869-normal-WIFI.webp)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
News July 8, 2024
ఉచిత ఇసుక: టన్ను రూ.1,394.. ఫ్లెక్సీలు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436253657-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.