News July 3, 2024

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా

image

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన మహేశ్ చంద్ర ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పని చేస్తున్నారు. రాష్ట్ర సర్వీసులోకి ఆయనను పంపాలన్న సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయనను రిలీవ్ చేసింది. కాగా ప్రస్తుత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

Similar News

News July 8, 2024

ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News July 8, 2024

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ ఇదే..

image

✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్‌ కీ: అక్టోబర్‌ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్‌ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న

News July 8, 2024

స్మృతి మంధాన లవర్ ఇతనే..

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్‌ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.