News July 3, 2024

పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

పింఛను పంపిణీ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 ఉండగా ఇప్పటి వరకు 99.21% లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. దీని తర్వాత విజయనగరం రెండో స్థానంలో ఉంది. కాగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 3,16,528 మందికి పెన్షన్ పంపిణీ చేశారని అధికారులు తెలిపారు.

Similar News

News July 8, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. ఈ మేరకు అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News July 8, 2024

శ్రీకాకుళం: ‘కల్కి బుజ్జి’ కారు పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లాకు బుజ్జి కారు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కారు విజయనగరం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.

News July 8, 2024

ఎచ్చెర్ల: ప్రభుత్వ ITIలో 10న ఉద్యోగ మేళా

image

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ITI ప్రవేశాల జిల్లా కన్వీనర్ సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ITI ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేది ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బయోడేటా, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.