News July 3, 2024
ఉత్తమ ప్లాంటుగా చిల్పూర్ కేటీపీపీ
భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చిల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) 600 మెగావాట్ల ప్లాంట్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంటుగా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 8, 2024
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.
News July 8, 2024
WGL: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు
అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
News July 8, 2024
WGL: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు