News July 3, 2024

కడప: ఎమ్మెస్సీకి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.

Similar News

News July 8, 2024

YSRకు మాజీ సీఎం జగన్ నివాళి

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 8, 2024

రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య

image

రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.

News July 8, 2024

ప్రతీ కార్యకర్తకు వైసీపీ తోడుగా ఉంటుంది: YS జగన్

image

పులివెందుల: రాబోయే కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.