News July 3, 2024
సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం
అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.
Similar News
News July 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు
News July 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు
News July 8, 2024
ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నా: జగ్గారెడ్డి
సంగారెడ్డిలో MLAగా ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నానని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి జన్మదినోత్సవం సంద్భంగా నిర్వహించిన ర్యాలీలలో ఈ వాఖ్యలు చేశారు. ప్రజలు ఓడగొట్టామని ఫీల్ కావద్దని, తాను మనస్పూర్తిగా, దైవసాక్షిగా ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ది విషయంలో జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజలకు ఏమేమి కావాలో చేసిపెడతానని హామీ ఇచ్చారు.