News July 3, 2024
త్వరలో జిల్లాల పర్యటన: సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశంలో వెల్లడించారు. వారానికో జిల్లా పర్యటన ఉండేలా షెడ్యూల్ని త్వరలో విడుదల చేస్తామన్నారు. పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేలా చూడాలని సీఎస్ను ఆదేశించారు.
Similar News
News September 20, 2024
సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.
News September 20, 2024
మధ్యాహ్నం జగన్ ప్రెస్మీట్!
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై, కూటమి 100 రోజుల పాలన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
News September 20, 2024
All Time Record: ఫస్ట్టైమ్ 84000 బ్రేక్ చేసిన సెన్సెక్స్
BSE సెన్సెక్స్ ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు పెరిగిన సూచీ తొలిసారి 84,000 స్థాయిని బ్రేక్ చేసింది. ఒకానొక దశలో 84,240నూ టచ్ చేసింది. దీంతో BSEలోని కంపెనీల మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.469.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ50 ఫస్ట్టైమ్ 25,725 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు అదరగొడుతున్నాయి.