News July 3, 2024
నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP: సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.
Similar News
News September 16, 2025
ఉద్యాన తోటల్లో రాగి లోప లక్షణాలు – నివారణ

రాగి లోపం వల్ల కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. ఆకులు కిందకు వంగిపోతాయి. కాండము, కాయలు, ఆకులపై ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడతాయి. బొడిపెల్లాంటి మచ్చలు ఏర్పడి కాయల పరిమాణం తగ్గుతుంది. కాయల మధ్య బంక ఏర్పడుతుంది. కొమ్మల పైనుంచి కూడా బంక కారవచ్చు. రాగిధాతు నివారణ మందులను పిచికారీ చేసి.. కొన్ని శిలీంద్రాల ద్వారా వచ్చే తెగుళ్లతో పాటు పంటల్లో రాగిధాతు లోపాన్ని కూడా అరికట్టవచ్చు.
News September 16, 2025
శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. OCT 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నది హారతి, NOV 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శని, అది, సోమ, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు.
News September 16, 2025
కవిత రాజీనామా ఆమోదంపై సస్పెన్స్!

TG: బీఆర్ఎస్ మాజీ నేత కవిత MLC పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావొస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ లోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.