News July 3, 2024

మంత్రి కందుల దుర్గేశ్ నేటి పర్యటన షెడ్యూల్

image

రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ తూ.గో జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రాజమండ్రిలో గోదావరి గట్టుపై ఉన్న ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద, ధవళేశ్వరంలో జరిగే ఎస్వీ రంగారావు జయంతి వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు విజ్జేశ్వరం, ఒంటి గంటకు కొండ గుంటూరులలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి దుర్గేశ్ పాల్గొంటారు.

Similar News

News July 8, 2024

కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు

image

కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.