News July 3, 2024
HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719966963292-normal-WIFI.webp)
గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Similar News
News July 8, 2024
HYD: మాదాపూర్ డీసీపీ స్ట్రాంగ్ WARNING
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418278482-normal-WIFI.webp)
యువతీయువకులు డ్రగ్స్ తీసుకున్నా,వారి కోసం పబ్లు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని HYD మాదాపూర్ DCP వినీత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లలో తనిఖీలు చేసేటప్పుడు అక్కడికక్కడే యూరిన్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పాజిటివ్గా తేలితే సంబంధిత వ్యక్తులపై NDPSయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా,వాడినా 8712671111 నంబర్కు కాల్ చేయాలని కోరారు.
News July 8, 2024
HYD: గోల్కొండ జాతర.. కిక్కిరిసిన బస్సులు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720411971894-normal-WIFI.webp)
HYD గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, జవహర్నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. లక్షల మంది రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
News July 8, 2024
HYD: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720407333103-normal-WIFI.webp)
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.