News July 3, 2024

బదిలీ అయినా SGTలకు తప్పని తిప్పలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,448 మంది ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సుమారు 2,413 మంది కొత్త స్థానాల్లో విధుల్లో చేరగా.. మరో 1,095 మంది ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాత స్థానాల్లోనే కొనసాగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, మారుమూల తండాలు, శివారు గ్రామాల్లో కొత్త ఉపాధ్యాయులు రాకపోవడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది.

Similar News

News July 8, 2024

మహబూబ్‌నగర్: నేటి నుంచి మొహర్రం

image

హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ప్రతీక అయిన మొహర్రంను సోమవారం నుంచి జరుపుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పీర్ల ఊరేగింపు చాలా ప్రత్యేకత ఉంది. జిల్లాలో పది రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు గ్రామ గ్రామాన జరుపుకుంటారు. నారాయణపేట జిల్లా కోయిలకొండ బీబీ ఫాతిమా సవారి తర్వాత ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ సవారీలు వైభవంగా జరుగుతాయి.

News July 8, 2024

MBNR: 14న జగన్నాథ రథయాత్ర మహోత్సవం

image

శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం పాలమూరులో ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎం.యాదిరెడ్డి, రాజమల్లేశ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో పరమాద్భుతమైన ఉత్సవంగా జరగనుందని చెప్పారు.

News July 8, 2024

కృష్ణ జింకలకు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు

image

కృష్ణా నదీతీర ప్రాంతాల్లోని రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వందలాది కృష్ణ జింకలు పంట పొలాల్లోకి ప్రవేశించి, రైతులు విత్తిన విత్తనాలతోపాటు మొలకెత్తిన మొక్కలను తినేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.2.70 కోట్లు మంజూరు చేస్తూ, పరిపాలన అనుమతులు ఇచ్చింది.