News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

Similar News

News July 8, 2024

HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి

image

HYD నగరంలోని రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి పెరిగింది. నిత్యం ఓపీలు 600-700 నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 350-400 మందికి కీమోథెరపీ, 200-250 మందికి రేడియో థెరపీ చేస్తున్నట్లు వివరించారు. ఏటా రోగులు గణనీయంగా 20% పెరుగుతున్నారని పేర్కొన్నారు.

News July 8, 2024

HYD: మాదాపూర్ డీసీపీ స్ట్రాంగ్ WARNING

image

యువతీయువకులు డ్రగ్స్ తీసుకున్నా,వారి కోసం పబ్‌లు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని HYD మాదాపూర్ DCP వినీత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్‌లలో తనిఖీలు చేసేటప్పుడు అక్కడికక్కడే యూరిన్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పాజిటివ్‌గా తేలితే సంబంధిత వ్యక్తులపై NDPSయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా,వాడినా 8712671111 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

News July 8, 2024

HYD: గోల్కొండ జాతర.. కిక్కిరిసిన బస్సులు..!

image

HYD గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, జవహర్‌నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. లక్షల మంది రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.