News July 3, 2024
తొర్రూరు: అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719970538655-normal-WIFI.webp)
ప్రేమ పేరుతో బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. డివిజన్ కేంద్రానికి చెందిన ఓ బాలికపై వాటర్ ప్లాంట్లో పనిచేసే ఇనుగుర్తి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News July 8, 2024
BREAKING.. వరంగల్: మాజీ సర్పంచ్ దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720409643965-normal-WIFI.webp)
మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం బురాన్పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారు. కాగా, భూ తగాదాల విషయంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2024
SI మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: మాజీ MLA
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720404687899-normal-WIFI.webp)
పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News July 8, 2024
నేడు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720393003219-normal-WIFI.webp)
నేడు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని కోరారు.