News July 3, 2024

విశాఖలో ఉల్లి కోసం క్యూ

image

రైతు బజార్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్‌లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News July 8, 2024

విశాఖ ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ ప్రోగ్రాం ప్రారంభం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. గంభీరంలోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ హాజరయ్యారు. విభిన్న రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులకు పీహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ కావేరి కృష్ణన్, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్ పాల్గొన్నారు.

News July 8, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డల్లాస్‌లో నిరసనలు

image

అమెరికాలోని డల్లాస్‌లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ ‌లో స్టీల్ ప్లాంట్ ‌ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.