News July 3, 2024

సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మండలంలోని వెన్నదేవి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సత్తెనపల్లికి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, వెన్నాదేవి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రామారెడ్డి (55) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News July 8, 2024

మాచర్ల: రోడ్డు ప్రమాదంలో పర్యాటకశాఖ ఉద్యోగి మృతి

image

మాచర్ల మండలం ఏకనాంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటక శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రామారావు(45) బైక్ మీద వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 8, 2024

గుంటూరు: ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఇదే.!

image

జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉండగా.. టన్ను ధర రూ.250గా నిర్ణయించారు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి ఇసుక పొందవచ్చని జిల్లా అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234301కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

News July 8, 2024

నేటి నుంచి పిన్నెల్లి విచారణ

image

మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్‌లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.