News July 3, 2024
HYD: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719980869954-normal-WIFI.webp)
HYD నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.వరలక్ష్మీ తెలిపారు. ఆంగ్లం, అరబిక్, ఉర్దూ మీడియం(హిస్టరీ), కామర్స్, BBA, BBA ఈ-కామర్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్, జువాలజీలో అర్హులైనవారు ఈనెల 5 వరకు కాలేజీలో దరఖాస్తులు చేసుకోవాలని, 6న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
Similar News
News July 8, 2024
HYD: డ్రగ్స్ తీసుకున్న 12 మందిపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720444848390-normal-WIFI.webp)
డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్థులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం, సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
News July 8, 2024
HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720426762616-normal-WIFI.webp)
ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.
News July 8, 2024
HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720421865156-normal-WIFI.webp)
గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.