News July 3, 2024
బాసర : నేడు IIITలో ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719976875803-normal-WIFI.webp)
బాసర IIITలో 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను క్యాంపస్లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్ఛార్జి వీసీ తెలిపారు. జాబితా విడుదలైన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
Similar News
News July 8, 2024
దండేపల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418191872-normal-WIFI.webp)
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోడకుంట హరికృష్ణ(24) శనివారం రోజున లక్షట్టిపేట గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2024
ఇచ్చోడ: పాము కాటుతో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720380171489-normal-WIFI.webp)
ఒక రైతు తన పంట పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పాము కాటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం దాబా (కే) గ్రామంలో చోటు చేసుకుంది. దాబా (కే) గ్రామానికి చెందిన జాదవ్ లక్ష్మణ్ (28) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
News July 8, 2024
మందమర్రి: బావిలో మృతదేహం కలకలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720403741716-normal-WIFI.webp)
మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.