News July 3, 2024

నిడదవోలు: నేటి నుంచి రైళ్ల దారి మళ్లింపు

image

పెద అవుటుపల్లి-గన్నవరం మధ్య ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా నేటి నుంచి నడిచే పలు రైళ్లను నిడదవోలు-గుడివాడ- విజయవాడ మార్గంలో నడుపుతున్నట్లు ద.మ. రైల్వే విజయవాడ డివిజన్ పిఆర్ నుస్రత్ మంద్రుపాకర్ తెలిపారు. విశాఖపట్నం-కొల్లాం మధ్య నడిచే నిడదవోలు- గుడివాడ- విజయవాడ రైలు మార్గంలో నడపనున్నట్లు తెలిపారు. ధన్బాద్-తాంబరం ఎక్స్ప్రెస్, బరోని-మంగుళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ నిడదవోలు- విజయవాడ మార్గంలో నడుస్తాయన్నారు.

Similar News

News July 8, 2024

ఏలూరు: అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్

image

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్న భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో పాల్గొన్నారు.

News July 8, 2024

ప.గో.: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

అగ్నివీర్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయి ఉద్యోగాల నియామకం కోసం భారత వాయుసేన నోటిఫికేషన్ విడుదల చేసిందని ప.గో. జిల్లా ఉపాధి అధికారి మధుభూషణరావు తెలిపారు. జులై 2004 నుంచి జనవరి 2008 మధ్య జన్మించిన స్త్రీ/పురుష అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంగ్లీష్‌లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కనీసం 50 శాతం మార్కులతో పాసైనవారు http://agnipathvayu.cdac.in వెబ్ సైట్లో 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలన్నారు.

News July 8, 2024

ప.గో జిల్లాలో జోరుగా వ్యవసాయ పనులు

image

ప.గో జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం మండలాల్లో 21,983 ఎకరాల్లో ఇప్పటికే నాట్లు పడ్డాయన్నారు. ఈ నెలాఖరుకు అత్యధిక విస్తీర్ణంలో నాట్లు పూర్తవుతాయని, పల్లపు ప్రాంతాల్లో నారు సంరక్షణకు రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.