News July 3, 2024

BJPకి ఆ సిద్ధాంతాలు తెలియడం లేదు: రాహుల్ గాంధీ

image

హింసను, విద్వేషాన్ని వ్యాపింపజేసే బీజేపీకి హిందూధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలు తెలియడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడిని పిరికిపంద చర్య పేర్కొన్నారు. ఈ హింసాత్మక దాడి బీజేపీ, సంఘ్ పరివార్‌పై తన అభిప్రాయాన్ని బలపరుస్తుందని Xలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని, ఆ రాష్ట్రంలో INDIA కూటమి గెలుస్తుందని మరోసారి చెప్పారు.

Similar News

News September 20, 2024

దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్

image

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.

News September 20, 2024

కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం

image

AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

News September 20, 2024

తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ రియాక్షన్

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రసాదం నాణ్యతపై వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ‘బాలాజీ’ ఆరాధ్య దేవుడు. ఈ ఆరోపణలు ప్రతి ఒక్క భక్తుడిని బాధిస్తున్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. మన దేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలి’ అని Xలో ట్వీట్ చేశారు.