News July 3, 2024
FLASH.. సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య

సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి(48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
కరీంనగర్: రేపు SPECIAL లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కే.రాణి తెలిపారు. ఈ అదాలత్లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాదాల పరిహారం వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కారమవుతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 13, 2025
కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 13, 2025
శాతవాహన ఆర్ట్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్పై అవగాహన

శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ సుజాత అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, షీ టీమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత అవగాహన కల్పించారు.


