News July 3, 2024

పట్టాలెక్కిన రెండో లైను.. 3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుం’టూరు’

image

సికింద్రాబాద్-గుంటూరు రూట్‌లో నల్లపాడు-BBనగర్ మధ్య 248KM మేర 2వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. ₹2853కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి. పూర్తైతే 3 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ప్రస్తుతం సింగిల్ లైన్ వల్ల ఒక రైలు వస్తుంటే మరొకటి స్టేషన్‌లో ఆగాల్సి వస్తోంది. 140% సామర్థ్యంతో ఈ రూట్‌లో రైళ్లు నడుస్తున్నాయి.

Similar News

News April 3, 2026

ప్రసవం తర్వాత డిప్రెషన్‌లోకి తండ్రులు: అధ్యయనం

image

బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులకూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 30%మంది తండ్రులు ఈ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేమి, పెరిగిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు. తండ్రి డిప్రెషన్‌లో ఉంటే అది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 3, 2026

13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

image

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

News April 3, 2026

₹10,000CRతో ‘మావిగన్’ మహానగరం: భరత్

image

AP: అమరావతికి వెచ్చించే ₹2L కోట్లలో కేవలం ₹10,000CR ‘మావిగన్’కు ఖర్చు చేస్తే మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో మహానగరం అభివృద్ధి చెందుతుందని YCP మాజీ MP భరత్ పేర్కొన్నారు. ‘మావిగన్ HYD, బెంగళూరుతో పోటీపడుతుంది. నగరాల అభివృద్ధికి వందల ఏళ్లు పడుతుంది. విశాఖ, విజయవాడ నగరాలను కాదని అమరావతిని శూన్యం నుంచి మొదలు పెడతారా? రాజధాని పేరుతో దోచుకుంటున్న CBN, ఇతర నేతలకే అమరావతి గ్రోత్ ఇంజిన్’ అని విమర్శించారు.