News July 3, 2024
పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొనకపోవడంపై నీరజ్ రియాక్షన్ ఇదే..

పారిస్ డైమండ్ లీగ్ నుంచి తప్పుకున్నారనే ప్రచారాన్ని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఖండించారు. తన సీజన్ క్యాలెండర్లో ఈ లీగ్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్కు సన్నద్ధమవడంపై ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలిపారు. పోటీలో ఉన్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
Similar News
News March 4, 2026
ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్లో 10.93 రన్ రేట్తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.
News March 4, 2026
మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగార్కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్ టీమ్ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్ను పెంచాలని కోరారు.
News March 4, 2026
రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.


