News July 3, 2024
ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక: మంత్రి కొల్లు

AP: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇసుక విధానంతో ఐదేళ్ల పాటు పేదలను దోచుకుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
HYD: ధరలు తగ్గిన చరిత్ర లేదు.. అడ్డుకోరా?

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా రూ. 5 నుంచి రూ. 10 పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గించే ‘చరిత్ర’ మాత్రం లేదు. గతంలో ధరలు పెరిగినప్పుడు పెంచిన రేట్లు, మళ్లీ తగ్గినా కిందికి రాలేదు. ఉదాహరణకి ఆనియన్ సలాడ్! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదనే పడుతోంది. ఈ దోపిడీని అడ్డుకోరా?
News March 16, 2026
రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు: FIR

TG: మొయినాబాద్ <<19386155>>కేసులో<<>> మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆహ్వానంతోనే నిందితులు పార్టీకి వచ్చినట్లు FIRలో వెల్లడైంది. 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, సిమ్లాలో కొకైన్ కొన్నట్టు నిందితుడు కౌశిక్ అంగీకరించినట్లు పేర్కొంది. పోలీసులమని చెప్పినా షూట్ చేశారని.. రోహిత్ రెడ్డి సోదరుడైన రితేశ్ రెడ్డి పేరున ఉన్న ఆ గన్ను సీజ్ చేసినట్లు పేర్కొంది.
News March 16, 2026
దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా మోదీ చర్యలు: చంద్రబాబు

AP: యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్కు ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా PM మోదీ చర్యలు చేపడుతున్నారు. కష్టకాలంలో కుంగిపోకుండా సమష్టిగా పనిచేయాలి. అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను గుర్తు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’ అని అమరావతిలో అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.


