News July 3, 2024
భారత్ తన బ్రాండ్ నిలబెట్టుకుంది: పాక్ క్రికెటర్
T20 WC గెలిచి మరోసారి టీమ్ ఇండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. ‘ఫైనల్లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్గా నిలుస్తుంది. ఫైనల్లో టీమ్ ఇండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 5, 2024
Project Flower గురించి తెలుసా?
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగిన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు పరస్పరం సహకరించుకున్నాయి. సైనిక సహకారం కోసం Project Flower పేరుతో 1977లో ఇరాన్-ఇజ్రాయెల్ కలసి పనిచేశాయి. నాటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ భారీగా అయిల్ వనరులు పొందింది. అయితే, ఈ ప్రాజెక్టు 1979లో Iranian Revolution- 1979 కారణంగా అర్ధాంతరంగా ముగిసింది.
News October 5, 2024
‘రాజా సాబ్’ టీమ్కు ప్రభాస్ సూచన?
మారుతి డైరెక్షన్లో ‘రాజా సాబ్’లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన లైనప్లో సలార్-2, స్పిరిట్, హను-ప్రభాస్, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్కు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి..
News October 5, 2024
అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.