News July 3, 2024
ఏయూ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదా: టీ. చిట్టిబాబు

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ. చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు 4వ తేదీన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Similar News
News January 1, 2026
విశాఖలో ఒక్కరోజే రూ.9.90 కోట్ల మద్యం అమ్మకాలు

న్యూఇయర్ సందర్భంగా విశాఖలో మద్యం అమ్మకాలు ఊహించిన దానికంటే భారీగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.9.90 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా విశాఖలో రోజుకు రూ.5-6 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే.. నిన్న అదనంగా రూ.3 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. నిన్న, ఈరోజు వైన్స్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.
News January 1, 2026
జీవన్దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.
News January 1, 2026
విశాఖలో కూటమి నేతల ఐక్యత స్వరం

స్టీల్ ప్లాంట్, విశాఖ భూముల అంశాలు, తదితర సమస్యలపై YCP, వామపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో విశాఖ MP, MLAలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. దీంతో వీరి మధ్య సరైన సమన్వయం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్న వాదనలున్నాయి. అయితే అనూహ్యంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘మేమంతా కలిసే ఉన్నాం’ అని సంకేతాలిచ్చారు.


