News July 3, 2024
లంచం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్
నివాస ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో నాగుపల్లికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుని పట్టుబడిన ఆర్ఐ జబ్బా ఎర్రయ్య సస్పెన్షన్కు గురయ్యారు. నివాస ధ్రువీకరణ పత్రం కోసం ఆర్ఐ రూ.10 వేలు లంచం అడగగా బాధితుడు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అనంతరం వాస్తవమని తేలడంతో RIని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 7, 2024
కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
News October 7, 2024
ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ
ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.
News October 7, 2024
రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.