News July 3, 2024

విజయవాడలో ఏపీఎండీసీ ఫైల్స్ దగ్ధం.. ఘటనపై అనుమానాలు?

image

AP: విజయవాడలో ఏపీఎండీసీ ఫైళ్ల దహనం ఘటన కలకలం రేపింది. పెదపులిపాక కరకట్ట వద్ద కొందరు కారులో వచ్చి ఫైళ్లను తగలబెట్టారు. దస్త్రాలు తగలబడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లడంతో వారు కారులో పరారయ్యారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Similar News

News March 21, 2026

ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

image

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.

News March 21, 2026

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.

News March 21, 2026

ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నావ్ రేవంత్: హరీశ్ రావు

image

TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘మీరు ప్రారంభించే పనులు కాంగ్రెస్ చేసినవి కావు. శ్రమ మాది శిలాఫలకాలు కాంగ్రెస్‌వి. ఆయిల్ ఫామ్‌కు ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టే. దానిపై మీ వైఖరి మార్చుకోవాలి. 3 పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేట వస్తున్నారు’ అని హరీశ్ ప్రశ్నించారు.