News July 4, 2024
సింహగిరి ప్రదక్షణ అధికారులతో సమీక్షించిన కమిషనర్

ఈ నెల 20,21 వ తేదీలలో జరుగనున్న శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత ఈ రోజు నగర పోలీసు కమీషనర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు రివ్యూ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పలు గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను వీడియోల ద్వారా పరిశీలించారు. దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు, సముద్ర స్నానాల్లో భద్రత చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
Similar News
News March 1, 2026
రూపాయికే ఎకరా.. చిన్న కంపెనీకి భారీ రాయితీనా: వైసీపీ

తర్లువాడలో సెమీకండక్టర్ యూనిట్కు ఎకరాకు రూపాయి చొప్పున 30 ఎకరాల భూమి కేటాయింపుపై YCP సందేహాలు వ్యక్తం చేసింది. ASIP టెక్నాలజీస్ లాంటి చిన్న ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత తక్కువ ధరకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. ఈ నిర్ణయంపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని వైసీపీ నేత అమర్నాథ్ SMలో డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్, టీడీపీ స్పష్టత ఇవ్వాలన్నారు.
News March 1, 2026
విశాఖలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు.. యువతే లక్ష్యం

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న పెందుర్తిలో 4 గ్రా. ఎండీఎంఏ స్వాధీనం కాగా, రెండు రోజుల క్రితం ఎంవీపీ పోలీసులు 2.23 గ్రా. యువకుడిని అరెస్ట్ చేశారు. గతేడాది నగర పరిధిలో గంజాయి, హ్యాష్ ఆయిల్ తదితరవి పట్టుబడగా వాటి విలువ రూ.5 కోట్లగా ఉంది. 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.
News March 1, 2026
విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


