News July 4, 2024

జడ్జిలు, రాజకీయ ప్రముఖుల ఫోన్‌లను ట్యాప్ చేశారు: పోలీసుల అఫిడవిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేశారు. ఇప్పటికే నలుగురు పోలీసులను అరెస్ట్ చేశాం. ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేసి మెటీరియల్ సీజ్ చేశాం. కేసు నమోదు కాగానే ఎస్ఐబీ మాజీ చీఫ్ దేశం వదిలి వెళ్లిపోయారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

News October 16, 2024

ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.

News October 16, 2024

BREAKING: సజ్జలకు పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.